నాపై అత్యాచారం చేసింది ఆయనే..

by  |
నాపై అత్యాచారం చేసింది ఆయనే..
X

న భర్తతో కలిసి బీజేపీ నేత రఘనందన్ రావు సామూహిక అత్యాచారం చేశాడని రాధారమణి మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియా ఎదుట సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళలను లొంగదీసుకుని వారితో నీలి చిత్రాలు తీస్తాడని, వాటిని రాజకీయ నాయకులకు పంపి బ్లాక్ మెయిల్ చేయిస్తాడని పేర్కొంది. అత్యాచారం చేసినప్పుడే విషయం బయట చెప్తానని తనను కిడ్నాప్ చేశారని, తన భర్త కూడా అతనితో కలిసిపోయాడని ఆవేదన వ్యక్తంచేసింది. తనకు, తన బిడ్డకు రఘునందన్ నుంచి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని మీడియా ఎదుట పోలీసులను కోరింది.

Next Story