కొవిడ్ ​మార్గదర్శకాలతోనే పుష్కరాల నిర్వహణ

by  |
కొవిడ్ ​మార్గదర్శకాలతోనే పుష్కరాల నిర్వహణ
X

దిశ, ఏపీబ్యూరో: తుంగభద్ర పుష్కరాలను కొవిడ్ ​మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించనున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి తెలిపారు. శనివారం కర్నూలులో పుష్కర ఏర్పాట్ల పనులను ఆయన పరిశీలించారు. నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర తీరం వెంబడి 21 ఘాట్లలో పుష్కరాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రూ.230 కోట్లు వెచ్చించి ఘాట్లను శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నంద్యాల చెక్​పోస్టు నుంచి వేసిన రోడ్డు, సంకల్ బాగ్, రాఘవేంద్ర మట్, పంప్ హౌస్, మునగాల పాడు, సుంకేసుల డ్యామ్ వద్ద పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను బుగ్గన తనిఖీ చేశారు. మంత్రితోపాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఉన్నారు.

Next Story