సీఎం కీలక నిర్ణయం.. ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

by  |
సీఎం కీలక నిర్ణయం.. ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు అక్కడి పంజాబ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని ఓ ప్రకటనలో పేర్కొ్ంది. ఆ రాష్ట్ర ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే ప్రతిపాదనకు ఈరోజు పంజాబ్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో బాలికలు, మహిళలను సాధికారతవైపు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ తెలిపారు. ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని అమరీందర్‌ సింగ్ ఇది వరకే హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed