పవన్‌తో పక్కా సినిమా తీస్తాం : నిర్మాత పుల్లారావు

by  |
power star pawan kalyan
X

దిశ, సినిమా : జనసేనాని పవన్ కల్యాణ్ మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత ‘వకీల్‌సాబ్’గా ప్రజల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరాం డైరెక్షన్‌లో దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. కొవిడ్ సెకండ్ వేవ్ బలంగా వీస్తున్న ఈ సమయంలోనూ ‘వకీల్ సాబ్’ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా మూడు చిత్రాలు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్, హరిహరవీరమల్లు, హరీశ్ శంకర్ #PSPK28’ పవన్ చేస్తుండగా తాజాగా పవర్ స్టార్‌తో మరో చిత్రం తప్పక తీస్తామని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ జె.భగవాన్, పుల్లారావు తెలిపారు. ఇటీవల కరోనా బారిన పడిన పవన్ ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

ట్రెండ్‌కు తగ్గ కథలు తీసేందుకు ఎప్పుడూ ముందుండే నిర్మాతలు భగవాన్, పుల్లారావు ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌గా హీరోగా వస్తున్న ‘రిపబ్లిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవకట్టా డైరెక్షన్‌లో తెరకెకకుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇక ఈ సినిమా సంగతి పక్కనబెడితే.. వచ్చే ఏడాది పవన్ కల్యాణ్‌తో పక్కా ఓ సినిమా తీస్తామని జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మాత జె.పుల్లారావు వెల్లడించారు. పవన్‌‌తో సినిమా తీయడమనేది తమ ఏళ్ల కలని, దాని కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఓ మంచి కథ అనుకున్నామని, తప్పకుండా పవన్‌తో సినిమా మొదలవుతుందని, ఆ వివరాలు త్వరలో చెప్తామని పేర్కొన్నారు. పవన్‌తో సినిమా తీయాలనే తన కలను దిల్‌రాజు ‘వకీల్ సాబ్’‌తో సాకారం చేసుకున్న విషయం విదితమే.



Next Story