హత్యా స్థలంలో నేను ఉన్న మాట వాస్తవమే: అనురాధ

by  |
హత్యా స్థలంలో నేను ఉన్న మాట వాస్తవమే: అనురాధ
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ అనురాధ గురువారం మీడియా ముందుకు వచ్చారు. నిన్నటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సుబ్బయ్య హత్యా స్థలంలో తాను ఉన్నమాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి తాను అక్కడే ఉన్నానని తెలిపారు. హత్యకు ముందు సుబ్బయ్య తనకు ఫోన్ చేశారని చెప్పారు. ఫోన్ చేసిన 2 నిమిషాలకే సభా వేదిక దగ్గరకు సబ్బయ్య చేరుకున్నారని వెల్లడించారు.

ఆయన వచ్చే సమయానికి తాను సభా స్థలం దగ్గర ఉన్న హోమంలో ఉన్నానని చెప్పారు. తనతో మాట్లాడుతానన్న సుబ్బయ్యతో మళ్లీ మాట్లాడుతానని సైగ చేశానని పేర్కొన్నారు. కాసేపటికే అదే చోట సుబ్బయ్య హత్యకు గురయ్యాడు. సుబ్యయ్య హత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తాను ప్రభుత్వ ఉద్యోగిననీ..తనకు రాజకీయాలతో సంబంధం లేదని వెల్లడించారు. తనపై కేసు పెట్టడం వెనక ఎవరిదో ప్రోత్సాహం ఉందని అన్నారు.



Next Story

Most Viewed