రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి: సోము వీర్రాజు

by  |
రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి: సోము వీర్రాజు
X

దిశ, ఏపీ బ్యూరో: నీటి పంపకాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. శనివారం కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడియన ఆయన.. గత ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల కోసం జారీ చేసిన జీవోలు ఇంకా అమలు కాలేదన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం మాదిరిగా రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీమ ప్రాజెక్టులపై కర్ణాటకతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు. రాయలసీమలో కేంద్రం చేసిన అభివృద్ధిని ప్రభుత్వం దాస్తోందని, ఎర్రచందనాన్ని ప్రభుత్వం స్మగ్లర్లకు వదిలేసిందని ఆరోపించారు.

Next Story

Most Viewed