- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, గండిపేట్ : గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని హిమాయత్సాగర్ కార్పొరేటర్ ముద్దం రాము అన్నారు. గురువారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ముద్దం రాము అంగన్వాడీ సూపర్వైజర్ మన్నెమ్మతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రాము మాట్లాడుతూ.. గర్బిణీగా ఉన్నప్పటి నుంచే పౌష్టికాహారం తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా చిన్నారులకు సైతం పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. తద్వారా చిన్నారుల ఎదుగుదల బాగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుజాత, పద్మ, గర్భిణీ మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.