ప్రకాశ్‌రాజ్‌కు కోర్టు నోటీసులు..

by  |
ప్రకాశ్‌రాజ్‌కు కోర్టు నోటీసులు..
X

వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రకాశ్ రాజ్..ప్రస్తుతం సినిమాలు తగ్గించేశారు. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ సినిమా ‘దయ’తో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన ప్రకాశ్ రాజ్..దాదాపు 20 చిత్రాలు నిర్మించాడు. వీటిలో చాలా సినిమాలు ఫిల్మ్ ఫేర్, తమిళనాడు స్టేట్ అవార్డులు పొందగా..’పుట్టక్కన హైవే’ సినిమా బెస్ట్ రీజినల్ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డు గెలుచుకుంది.

అయితే ‘నడిగర్’ అనే తమిళ సినిమాను నిర్మించిన ప్రకాశ్ రాజ్ ఇందుకోసం అప్పు చేశాడట. బాలీవుడ్ ఫైనాన్షియర్ దగ్గర రూ. 5 కోట్లు తీసుకున్నాడట. అప్పు తీర్చే క్రమంలో రూ. 5 కోట్ల విలువైన చెక్ ఇవ్వగా.. అది కాస్త బౌన్స్ అయిందట. దీంతో సదరు ఫైనాన్షియర్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఏప్రిల్ 2లోగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

Next Story