బావకు కరోనా పాజిటివ్.. ఐసోలేషన్‌కు ఎమ్మెల్యే

by Vemula.Srinu Prasad |

<p>గుంటూరు జిల్లాలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి (వ్యాపారి) జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడికి వరుసకు బావ అవుతాడు. దీంతో ఎమ్మెల్యేను కూడా అధికారులు ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఆ వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆయనతో పాటు విందులో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నాడు. అయితే ఎమ్మెల్యేకు కూడా వైరస్ లక్షణాలు సోకే ప్రమాదం ఉందన్న అనుమానంతో [&hellip;]</p>

గుంటూరు జిల్లాలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి (వ్యాపారి) జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడికి వరుసకు బావ అవుతాడు. దీంతో ఎమ్మెల్యేను కూడా అధికారులు ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఆ వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆయనతో పాటు విందులో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నాడు. అయితే ఎమ్మెల్యేకు కూడా వైరస్ లక్షణాలు సోకే ప్రమాదం ఉందన్న అనుమానంతో ఐసోలేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని కాటూరి వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు ఆయనకు తరలించారు. కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించనున్నారు.

Next Story