పెళ్లి వేడుకలో 86 మందికి పాజిటివ్.. కొత్త జంటకు టెన్షన్

by  |
India corona cases
X

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని వర్ని మండలంలోని సిద్ధాపూర్‌లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇటీవలే హన్మజీపేట్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి వందలాది మంది హాజరయ్యారు. అయితే, వివాహ కార్యక్రమంలో పాల్గొన్న 86 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఆ పెళ్లి వేడుకలో పాల్గొన్న 370 మందికి కరోనా టెస్టులు చేయగా.. వారిలో 86 మందికి పాజిటివ్‌గా తేలింది. అప్రమత్తమైన అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు మరికొంతమందికి కరోనా టెస్టులు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. సిద్దాపూర్‌లో ఆరోగ్యశాఖ అధికారులు క్యాంప్‌ను ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహిస్తున్నారు.



Next Story

Most Viewed