నా పని అయిపోయింది.. ఇక నెక్ట్స్ నువ్వే అక్షయ్ అంటున్న పూజా హెగ్డే

by  |
puja
X

దిశ, సినిమా : పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో హీరో సుశాంత్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పూజా మొక్కలు నాటింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన సంతోష్.. ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మంచి భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీ అభిమానులు కూడా కొనసాగిస్తారని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. కాగా ఈ ఛాలెంజ్‌ను కంప్లీట్ చేసిన నటి.. బాలీవుడ్ హీరోస్ అక్షయ్‌ కుమార్‌, రితీష్‌ దేశ్‌ముఖ్‌లను నామినేట్‌ చేసింది.

https://twitter.com/MPsantoshtrs/status/1464181199618801668?s=20


Next Story

Most Viewed