బీజేపీలో చేరనున్న రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ప్రేమ్ కుమార్

by Disha Web Desk 11 |
బీజేపీలో చేరనున్న రియల్​ ఎస్టేట్​ వ్యాపారి ప్రేమ్ కుమార్
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లికి చెందిన రియల్​ ఎస్టేట్​ వ్యాపారి, వెస్ట్​ జోన్​ బిల్డర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు ముమ్మారెడ్డి ప్రేమ్​ కుమార్​ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడు హరీష్​ రెడ్డితో కలిసి బుధవారం డిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూకట్​పల్లి నియోజకవర్గంలో రాజకీయాల గురించి సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. రానున్న ఎన్నికలలో కూకట్​పల్లిలో బీజేపీ జెండా ఎగరేసేందుకు రాష్ట్ర నాయకత్వం సైతం కూకట్​పల్లి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పార్టీ కార్యక్రమాలతో పాటు, ప్రజలలో బీజేపీ పార్టీని బలంగా తీసుకు వెళ్లడానికి చర్యలు తీసుకుంటుంది.

ఇప్పటికే నియోజకవర్గంలో బీజేపీ నాయకులు పాదయాత్రలు నిర్వహిస్తుంటే కూకట్​పల్లిలో బలమైన సామాజిక వర్గంతో పాటు, ముమ్మారెడ్డి చారిటబుల్​ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్త, రియల్​ ఎస్టేట్​ వ్యాపారి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటుండటంతో నియోజకవర్గంలో రాజకీయ నాయకుల మధ్య గట్టి చర్చ నడుస్తుంది. కొన్ని రోజులలో తన మద్దతుదారులతో భారీ సభ నిర్వహించి బీజేపీ పార్టీలో చేరేందుకు ప్రేమ్​ కుమార్​ పావులు కదుపుతున్నట్టు, బీజేపీ అధిష్టానం సైతం ప్రేమ్​ కుమార్​ను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించింది. కొన్నిరోజుల క్రితం రాష్ట్ర బీజేపీ ఇంచార్జి తరుణ్​ చుగ్​ ప్రేమ్​ కుమార్ నివాసానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు. కిషన్​ రెడ్డిని కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు హరీష్​ రెడ్డితో పాటు, మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.



Next Story