Magunta: చాయ్ పే చర్చ అంటూ ఓటర్లతో మాగుంట..!

by Disha Web Desk 3 |
Magunta: చాయ్ పే చర్చ అంటూ ఓటర్లతో మాగుంట..!
X

దిశ, ఒంగోలు.: ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రజలకు దగ్గర కావడానికి రాజకీయ నాయకులు విభిన్నమైన కార్యక్రమాలు చేస్తూ.. ఓటర్ల అభిమానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి ఉదయాన్నే వాకింగ్ చేస్తూ.. కనిగిరి పట్టణంలో పర్యటించారు.

ఈ క్రమంలో మాగుంట, ఉగ్ర ఇరువురు టీ స్టాల్స్‌ని సందర్శిచారు. అక్కడ ఛాయ్ తాగుతూ ప్రజలతో మాట్లాడారు. రోజు వారీ వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులను పలకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.



Next Story

Most Viewed