ఆలయాలపై దాడుల్లో రాజకీయ హస్తం: డీజీపీ

by  |
ఆలయాలపై దాడుల్లో రాజకీయ హస్తం: డీజీపీ
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఆలయాలపై దాడుల ఘటనల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ ఘటనల్లో 17మంది టీడీపీ , నలుగురు బీజేపీ నేతల హస్తం ఉన్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే 13మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఆలయాలపై దాడుల విషయంలో దుష్ఫ్రచారం చేస్తున్నారని అన్నారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో భద్రత పెంచుతున్నామని చెప్పారు.

Next Story

Most Viewed