- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.50 లక్షలు విలువ చేసే నకిలీ విత్తనాల పట్టివేత
by Shyam |
<p>దిశ, డోర్నకల్: నకిలీ పత్తివిత్తనాల విక్రయాలను పాల్పడుతున్న వ్యక్తిని శుక్రవారం మానుకోట పోలీసులు అరెస్టు చేసి, రూ.50 లక్షలు విలువ చేసే విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. ఎస్పీ కోటిరెడ్డి వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాంతానికి చెందిన ఉప్పల శ్రీనివాస్ క్రాంతి ఫర్టిలైజర్స్ నిర్వహిస్తున్నాడు. అమాయక రైతులను మోసగించి నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్నాడు. దీంతో సమాచారం మేరకు మానుకోట డీఎస్పీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ టౌన్ సీఐ రవికుమార్ సిబ్బందితో దాడులు చేసి […]</p>

X
దిశ, డోర్నకల్: నకిలీ పత్తివిత్తనాల విక్రయాలను పాల్పడుతున్న వ్యక్తిని శుక్రవారం మానుకోట పోలీసులు అరెస్టు చేసి, రూ.50 లక్షలు విలువ చేసే విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. ఎస్పీ కోటిరెడ్డి వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాంతానికి చెందిన ఉప్పల శ్రీనివాస్ క్రాంతి ఫర్టిలైజర్స్ నిర్వహిస్తున్నాడు. అమాయక రైతులను మోసగించి నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్నాడు. దీంతో సమాచారం మేరకు మానుకోట డీఎస్పీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ టౌన్ సీఐ రవికుమార్ సిబ్బందితో దాడులు చేసి రూ.50 లక్షల విలువైన నకిలీ పత్తివిత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
Next Story






