బాల కార్మికులతో పనులు చేయిస్తున్న యజమానులపై కేసు

by  |
బాల కార్మికులతో పనులు చేయిస్తున్న యజమానులపై కేసు
X

దిశ ,కంటోన్మెంట్: బాల కార్మికులతో పనిచేయిస్తున్న రెండు మెకానిక్ షాపుల యాజమానులపై బోయిన్ పల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం.. బోయిన్ పల్లి చెక్ పోస్టు సమీపంలోని యాదవ్ పార్కింగ్ స్థలంలో ని జెజె మెకానిక్ దుకాణం యాజమాని మోయిజ్, అదేప్రాంతంలోని ఫయిమ్ ఆటో ఎలక్ట్రికల్స్ యాజమాని అబ్దుల్ ఫయిమ్‌లు ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన మహమ్మద్ రెహాన్(13), మహమ్మద్ ఇబ్రహీం(17)లతో తమ దుకాణాల్లో పనిచేయిస్తున్నారు.

సమాచారం అందుకున్న కార్మిక శాఖ అధికారులు ఆదివారం రెండు దుకాణాలలో దాడులు నిర్వహించారు. రెహాన్,ఇబ్రహీంలను రామాంతపూర్‌లోని హోమ్ కు తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మైనర్లతో తమ దుకాణాలలో పనులు చేయిస్తున్న మోయిజ్, అబ్దుల్ ఫయిమ్ లపై కార్మిక శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed