రిమ్స్ వైద్యుడిపై కేసు నమోదు

by  |

దిశ, ఆదిలాబాద్

ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉండకుండా రోగులకు వైద్యం చేసిన ఆదిలాబాద్ రిమ్స్ వైద్యుడు ఇద్రిస్ అక్బానీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మర్కజ్ వెళ్లి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచిన వ్యవహారంలో అతనిపై కేసు నమోదైంది. రిమ్స్ డైరెక్టర్బ లరామ్ నాయక్ఫి ర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, వైద్యుడు ఇద్రిస్‌కు కరోనా నెగెటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు.

Tags: Markaz, prayers, Adilabad, Rims, doctor, police, case file

Next Story

Most Viewed