వేటాడడం ఆ ఐదుగురికి సరదా..!

by  |
వేటాడడం ఆ ఐదుగురికి సరదా..!
X

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు వ్యక్తులు ఆవుపై కాల్పులుజరిపినట్లు గుర్తించిన పోలీసులు, నిందితులను అరెస్టు చేశారు. సీసీ కెమెరా ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు… ఇమ్రాస్‌, మహామీర్ అజీర్‌, షేక్‌ మహబూబ్‌, రాంచందర్‌, రఫీ వేటలో పాల్గొన్నట్టు ధృవీకరించారు. ఇమ్రాస్‌, హజార్‌ కాల్పులకు పాల్పడినట్లు గుర్తించారు. అడవులకు వెళ్లి వేటాడటం వీళ్ల సరదాగా పోలీసుల విచారణలో వెల్లడైంది. వేటకు ముందు ఇమ్రాస్రెక్కీ నిర్వహించినట్టు నిర్ధారించారు. నిందితుల్లో ఒకరైన ఇమ్రాన్ పరారీలో ఉండగా… అరెస్టైన హజార్‌ నుంచి రైఫిల్, 9 బుల్లెట్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.



Next Story