గంజాయ్ కోసం గుంటూర్ కు.. సీన్ కట్ చేస్తే..

by  |
గంజాయ్ కోసం గుంటూర్ కు.. సీన్ కట్ చేస్తే..
X

దిశ, ఏపీ బ్యూరో: బ్రాడీపేటలోని ఓ లాడ్జిలో శనివారం గంజాయి దందా సాగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు లాడ్జిపై దాడి చేయగా పోలీసులకు గంజాయి సేవిస్తూ ముగ్గురు యువకులు చిక్కారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 3 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్పులు, 50 గ్రాముల గంజాయి, రూ.8వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

అయితే వారంతా విద్యార్థులు అని పోలీసుల విచారణలో తేలింది. ఆ ముగ్గురు యువకులు సరదాగా గడుపుదామని గుంటూరు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వీరికి డ్రగ్స్‌ విక్రయించిన హైదరాబాద్‌కు చెందిన రేవంత్‌ కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ సుప్రజ మీడియా సమావేశంలో వెల్లడించారు.

Next Story

Most Viewed