రాజేంద్రనగర్‌లో కల్తీ పత్తి విత్తనాలు పట్టివేత

by  |
రాజేంద్రనగర్‌లో కల్తీ పత్తి విత్తనాలు పట్టివేత
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్ మల్లికార్జున‌నగర్‌లో నిషేధిత పత్తి విత్తనాలను ప్యాకింగ్ చేస్తున్న వ్యక్తిని బుధవారం సాయంత్రం శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడు బాల శౌరిరెడ్డిపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఇంద్ర, బిల్లా, పల్లవి తదితర 178 బీజీ-3 కాటన్ సీడ్ ప్యాకెట్లు, విడిగా ఉన్న బీజీ-3 నకిలీ పత్తి విత్తనాలు 20 కిలోలు, ప్యాకింగ్ మిషన్, 600 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధం ఉన్న కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు పరారయ్యారు. అనంతరం పట్టుబడ్డ వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు రాజేంద్రనగర్ పీఎస్‌కు అప్పగించారు.

Next Story