నేలకొండపల్లి టు కాకినాడ పోర్ట్..

by Sridhar Babu |
నేలకొండపల్లి టు కాకినాడ పోర్ట్..
X

దిశ, పాలేరు: అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరుట్ల గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామ సమీపంలోని మామిడి తోటలో వివిధ గ్రామాల్లో కొనుగోలు చేసిన 50 క్వింటాళ్ల బియ్యాన్ని, అక్కడి నుంచి కాకినాడ పోర్ట్‌కి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, విశ్వసనీయా సమాచారం మేరకు నేలకొండపల్లి ఎస్సై అశోక్ కుమార్ రెడ్డి తెల్లవారుజామున మాటువేసి పట్టుకున్నారు. కాగా కోదాడకు చెందిన బియ్యం వ్యాపారి ఈ అక్రమ దందా గత కొంతకాలంగా కొనసాగిస్తున్నట్టు సమాచారం. బియ్యం లారీని స్వాధీనం చేసుకుని, నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed