కోర్టులో సాక్ష్యం చెప్పొదన్న రౌడీ షీటర్.. చంపేస్తాడన్న భయంతో వారేం చేశారంటే.?

by  |
rowdy sheter murder case
X

దిశ, చార్మినార్​: కోర్టులో సాక్ష్యం చెప్పవద్దని ఒత్తిడి చేయడమే గాకుండా కేసు విత్​ డ్రా చేసుకోమని వెంట పడుతున్న రౌడీషీటర్​ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్​ గఫార్​ను బహదూర్​ పురా పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు సౌత్​ జోన్​ డిసిపి గజరావు భూపాల్ వెల్లడించారు. ఇప్పటికే ఈ హత్య కేసులో ఐదుగురుని బహదూర్​ పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. బహదూర్​ పురా కు చెందిన మహ్మద్​ ఎజాజ్​​(24) బహదూర్​ పురా పోలీస్​స్టేషన్​లో రౌడీషీటర్​. 2020లో అదే ప్రాంతానికి చెందిన మహ్మద్​ అబ్దుల్​ గఫార్​ (35)పై రౌడీషీటర్​ మహ్మద్ ఎజాజ్​ హత్యాయత్నానికి పాల్పడ్డ కేసు కోర్టులో నడుస్తుంది.

తనకు వ్యతిరేంగా కోర్టులో సాక్ష్యం చెప్పవద్దని, ఆ కేసు కాంప్రమైజ్​ చేసుకోవాలని అబ్దుల్ గఫార్​పై రౌడీషీటర్​ ఒత్తిడి చేయసాగాడు. దీంతో ఎక్కడ తనను హత్య చేస్తాడోనన్న భయంతో అబ్దుల్​ గఫార్ తన తండ్రి మహ్మద్​ అబ్దుల్​ రఫిక్​తో పాటు బంధువులు మహ్మద్​ అహ్మదుల్లా, మహ్మద్​ ఇనాయతుల్లా, ముంతాజ్​ ఆలీఖాన్​, సయ్యద్​ మహ్మద్​ హుస్సేన్​లతో కలిసి గత నెల మే​ 20వ తేదీన రౌడీషీటర్​ ఎజాజ్​పై ముందుగా కారం కలిపిన నీళ్లను ముఖంపై చల్లారు. అనంతరం కత్తి, కట్టెలతో తీవ్రంగా దాడి చేశారు. గ్రానైట్​ రాయితో తల పగులకొట్టి హత్య చేశారు. మృతుడు తల్లి నూర్జహా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బహదూర్​ పురా పోలీసులు అప్పట్లో ఐదుగురిని అరెస్ట్​ చేశారు. రౌడీషీటర్​ హత్యకు ప్రధాన కారకుడు అబ్దుల్​ గఫార్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​ కు తరలించారు. ​ఈ కేసును బహదూర్​ పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story