రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోడీ

by  |
రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రత్యేకంగా కలిశారు. ప్రస్తుతం ఇండియా-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఆయనకు ప్రధాని వివరించినట్టు సమాచారం. అంతేకాకుండా లఢక్ వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్ కంట్రీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి భారత్ తీసుకుంటున్న చర్యలు, ఆర్మీని సమాయత్తం చేసిన తీరు, చైనాపై భారత్ ప్రకటించిన డిజిటల్ వార్, పెట్టుబడుల నిరాకరణ మొదలగు వాటిని సవివరంగా రాష్ట్రపతికి ప్రధాని తెలియపరిచినట్టు పీఎంవో వెల్లడించింది



Next Story

Most Viewed