ఆయన స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్ అమలు

by  |
ఆయన స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్ అమలు
X

దిశ, వెబ్‌డెస్క్: రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్ విజన్‌ను రూపొందించినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని విశ్వభారతి యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి వర్చుల్ ద్వారా మోదీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రోద్యమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలోని విశ్వభారతి యూనివర్సిటీ కీలక పాత్ర పోషించిందన్నారు. ఆధ్యాత్మికతతో మానవాళి ప్రయోజనం పొందాలని ఠాగూరు కోరుకున్నారని తెలిపారు. విశ్వభారతి వర్సిటీ దేశానికి శక్తినిచ్చే సంస్థ అని కొనియాడారు.

Next Story

Most Viewed