మీటింగ్‌లో స్టేజీపైనే కొట్టుకున్నంత పని చేసిన పట్నం మహేందర్, పైలట్ రోహిత్ రెడ్డి (వీడియో)

by  |
Pilot-vs-patnam-1
X

దిశ, తాండూరు: పట్టణంలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సమక్షంలో వర్గ విభేదాలు బహిర్గతమవడం గమనార్హం. వేదికపైనే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బాహాబాహీకి దిగడంతో ఆగ్రహానికి లోనైన కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని సముదాయించారు. తాండూరు ప్రజాప్రతినిధులు అభివృద్ధిని మరిచిపోయి వర్గ విభేదాలు అంటూ బాహాబాహీకి దిగుతున్నారంటూ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed