వాహనదారులకు బ్యాడ్ న్యూస్

by  |
వాహనదారులకు బ్యాడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్ : వాహనదారులకు కేంద్రం మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది. చమురు ధరలను మరోసారి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వారం వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ‌పై రూ.50 పైసలు పెంచగా.. తాజాగా మళ్లీ రూ.25పైసలు పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి.

దీంతో ఒక నెలలో రూ.75పైసలకు పైగా పెరిగింది. ఇప్పటికే బయట బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.87 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.81 పలుకుతోంది. ఇది ఇలానే కొనసాగితే త్వరలోనే లీటర్ పెట్రోల్ త్వరలోనే రూ.100కు చేరువైనా ఆశ్ఛర్య పోనక్కరలేదని వాహనదారులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed