బైక్ అదుపు తప్పి యువకుడి మృతి

by  |
బైక్ అదుపు తప్పి యువకుడి మృతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రమాదవ శాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని మిడ్జిల్ మండలం జడ్చర్ల కల్వకుర్తి ప్రధాన రహదారి వద్దగల మున్ననూర్ టోల్గేట్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఉరుకొండ మండలం గుడియన్ పల్లికి చెందిన జంగయ్య (37) మృతి చెందాడు ఘటనా స్థలికి చేరుకున్న మిడ్జిల్ ఎసై సురేష్ బాబు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.



Next Story

Most Viewed