అతివేగమే కారణమా?

by  |
అతివేగమే కారణమా?
X

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటన నెక్కొండ మండలం పనికర గ్రామంలో‌ మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొనడంతో సాయిరెడ్డి పల్లె గ్రామం లావుడియా తండాకు చెందిన శంకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, నెక్కొండ నుంచి దీక్షకుంటకు వెళుతున్న అందె రఘుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని108లో ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.


Next Story