- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: బాలయ్య ఎక్కడికి వెళ్లినా.. తన వ్యవహారశైలితో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలుస్తూ ఉంటారు. తన మాటలు లేదా వ్యవహారంతో వార్తల్లో ఉంటూ ఉంటారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో బాలయ్య ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రచారం సందర్భంగా బాలయ్య ఒక అభిమానిని కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సోమవారం బాలయ్యకు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది.
బాలకృష్ణ 21వ వార్డు మోత్కుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో.. కొంతమంది స్థానికులు బాలయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నినాదాలు చేసినవారు వైసీపీ కార్యకర్తలు అని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు వైసీపీ అభ్యర్థి మారుతీరెడ్డికి పోలీసులు అనుమతి ఇచ్చారు.
కానీ అదే సమయంలో బాలయ్య అక్కడికి ఎన్నికల ప్రచారం చేసేందుకు వచ్చారు. దీంతో వైసీపీకి కేటాయించిన సమయంలో బాలయ్య ఎందుకుకొచ్చారంటూ వైసీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. గో బ్యాక్ బాలయ్య.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.