ప్రజలు నిండు మనసుతో దీవిస్తున్నారు

by  |
ప్రజలు నిండు మనసుతో దీవిస్తున్నారు
X

దిశ, గజ్వేల్: అన్ని వర్గాలను మెప్పించే విధంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సమకూరడంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ప్రజలు దీవిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లాలోని గజ్వేల్‌ మండలం దిలాల్‌ పూర్‌లో ఫంక్షన్‌హాల్‌, మహిళా భవనాన్ని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ…పట్టణాల్లో ఉండే గేటెడ్‌ సౌకర్యాలను మారుమూల గ్రామాల్లో సైతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమకూర్చిందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం కేసీఆర్‌ సమానంగా ముందుకు తీసుకుపోతూ, అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. దిలాల్‌పూర్‌ లాంటి మారుమూల గ్రామంలో గత ఆరేండ్లలో రూ.17 కోట్ల విలువ చేసే అభివృద్ధి జరిగిందన్నారు. కోటి 19 లక్షల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో ఫంక్షన్‌హాల్‌ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని చెప్పారు.

Next Story