సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

by  |
సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకి అని ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టును గాలేరు-నగరి ప్రాజెక్టుకు అనుసంధానం చేసి కుప్పం నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 550 కోట్ల పనులకు టెండర్లు కూడా పూర్తైనట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి జగన్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రత్యేక గ్రిడ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed