సాయిధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడా?

by  |
సాయిధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడా?
X

దిశ, సినిమా : మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ అప్‌మింగ్ ఫిల్మ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందట యాక్సిడెంట్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజుకు సపోర్ట్‌గా ఫంక్షన్‌కు వచ్చిన జనసేన అధినేత.. సుదీర్ఘ స్పీచ్‌తో ఆశ్చర్యపరిచారు. 51 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో అనేక సమస్యలను ఎత్తిచూపిన పవన్.. ఈ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకుల తీరును ఎండగట్టాడు. ఇక తేజు సినిమా ఫంక్షన్లకు ఎప్పుడూ అటెండ్ కాలేదన్న ఆయన.. ఎవరైనా తమ సొంత కాళ్లపై నిలబడాలన్నదే తన ఉద్దేశ్యమని తెలిపాడు. ఇదే సందర్భంగా తన మేనల్లుడు బాధ్యతారాహిత్యంగా ఓవర్ స్పీడ్‌తో వెళ్లాడని కథనాలు ప్రసారం చేసిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవర్ స్టార్.. అంతకంటే సీరియస్ ఇష్యూలు దేశంలో లేవా? అని ప్రశ్నించాడు. ఆస్పత్రిలో కళ్లు తెరవని స్థితిలో కోమాలో ఉన్నవాడిపై రాయాల్సిన అవసరం ఏంటని చురకలంటించాడు.

అయితే సాయిధరమ్ కోమా నుంచి కోలుకున్నాడని, కొద్దిరోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడని న్యూస్ వినిపిస్తున్న సమయంలో పవన్ స్టేట్‌మెంట్ కొంత గందరగోళానికి గురిచేసింది. పవన్ తన స్పీచ్‌లో చెప్పినట్టు తేజు ఇప్పటికీ కోమాలోనే ఉన్నాడా? లేదంటే పవన్ పొరపాటున అలా మాట్లాడి ఉంటాడా? అనే సందేహాలు వెలువడుతున్నాయి



Next Story

Most Viewed