- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్లో కూడా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్ అన్నాడు. ఇప్పటి వరకు అత్యధిక టైటిల్స్ గెలిన రికార్డు ముంబై పేరిటే ఉన్నది.. ఈ ఏడాది గెలిస్తే హ్యట్రిక్ కొట్టిన తొలి జట్టుగా నిలుస్తుందని పార్థీవ్ చెప్పాడు. ఈ రికార్డు సాధించడం రోహిత్ సేనకు పెద్ద కష్టమేం కాదని.. ఎప్పటిలాగే నిలకడగా ఆడితే సరిపోతుందని వివరించాడు.
గతేడాది క్రికెట్ నుంచి రిటైర్ అయిన పార్థీవ్ పటేల్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్గా పని చేస్తున్నాడు. ‘ఐపీఎల్ ద్వారా ప్రతీ ఆటగాడు తమ ప్రతిభను నిరూపించుకునే వీలుంటుంది. ధోనీ, గేల్, కోహ్లీ వంటి వారిని దగ్గర నుంచి చూసే అవకాశం నాకు ఐపీఎల్ ద్వారా దొరికింది. యువ క్రికెటర్లు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని పార్థీవ్ వెల్లడించాడు.
Next Story