పాక్‌పై భారత్ ఆగ్రహం

by  |
పాక్‌పై భారత్ ఆగ్రహం
X

న్యూఢిల్లీ: పీవోకేలో పాకిస్తాన్ దయమెర్-భాషా డ్యామ్ నిర్మించడంపై భారత్ ఆగ్రహించింది. భారత సరిహద్దుల్లో రకరకాల మార్పుల కోసం చేస్తున్న ప్రయత్నాలను ఖండించింది. గిల్గిత్-బాల్టిస్తాన్‌లో చిలాస్‌లోని ఈ డ్యామ్ నిర్మాణానాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం ప్రారంభించారు. భారత నిరసనలను ఖాతరు చేయకుండా చైనా ప్రభుత్వ కంపెనీ భాగస్వామ్యమున్న ఈ మెగా ప్రాజెక్టును నిర్మించడానికే పాకిస్తాన్ మొగ్గుచూపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్, లడాఖ్‌లు నిస్సందేహంగా భారత్‌ అంతర్భాగాలేనని, ఈ డ్యామ్ ప్రాజెక్టుపై పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత నిరసనను తెలిపామని వివరించారు. ఈ డ్యామ్ నిర్మిస్తే ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని చాలా భాగాలు డ్యామ్ నీటి కింద మునిగిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. ఇటువంటి అక్రమ స్వాధీన కుట్రలను సహించేది లేదని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed