- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ: పీవోకేలో పాకిస్తాన్ దయమెర్-భాషా డ్యామ్ నిర్మించడంపై భారత్ ఆగ్రహించింది. భారత సరిహద్దుల్లో రకరకాల మార్పుల కోసం చేస్తున్న ప్రయత్నాలను ఖండించింది. గిల్గిత్-బాల్టిస్తాన్లో చిలాస్లోని ఈ డ్యామ్ నిర్మాణానాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం ప్రారంభించారు. భారత నిరసనలను ఖాతరు చేయకుండా చైనా ప్రభుత్వ కంపెనీ భాగస్వామ్యమున్న ఈ మెగా ప్రాజెక్టును నిర్మించడానికే పాకిస్తాన్ మొగ్గుచూపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్, లడాఖ్లు నిస్సందేహంగా భారత్ అంతర్భాగాలేనని, ఈ డ్యామ్ ప్రాజెక్టుపై పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత నిరసనను తెలిపామని వివరించారు. ఈ డ్యామ్ నిర్మిస్తే ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని చాలా భాగాలు డ్యామ్ నీటి కింద మునిగిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. ఇటువంటి అక్రమ స్వాధీన కుట్రలను సహించేది లేదని స్పష్టం చేశారు.