ఆక్సిజన్ లేదు.. 200 మంది ప్రాణాలకు ముప్పు

by  |
ఆక్సిజన్ లేదు.. 200 మంది ప్రాణాలకు ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విలయతాడవంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక ఎంతో మంది కరోనాతో మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి చెందుతున్నారు. ఆక్సిజన్ కొరతతో నిన్న జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో 20 మంది మృతి చెందారు. ప్రస్తుతం జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఈ క్రమంలో జైపూర్ గోల్డెన్ ఆసుపత్రి వెంటిలేటర్లపై 200 మంది రోగులుఉన్నారు. ఒక వేళ ఆక్సిజన్ సరఫరా చేయకపోతే 200 మంది ప్రాణాలకు ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.



Next Story