పాకిస్తాన్ మళ్లీ దాడి చేస్తే.. మేమేం చేస్తామో వాళ్లకు బాగా తెలుసు !

by velandi.Saikiran |   (  Updated:2025-05-12 12:48:36  IST  )

పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సారి పాకిస్తాన్ ఏదైనా చర్య తీసుకున

పాకిస్తాన్ మళ్లీ దాడి చేస్తే.. మేమేం చేస్తామో వాళ్లకు బాగా తెలుసు !
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ కు ( Pakisthan) ఇండియన్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ ( Vice Admiral AN Pramod) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సారి పాకిస్తాన్ ఏదైనా చర్య తీసుకునే ధైర్యం చేస్తే... మనం ఏం చేయబోతామో పాకిస్తాన్ కు బాగా తెలుసు అని హెచ్చరించారు. అంతలా మొన్నటి వరకు భయపెట్టించామని తెలిపారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ సంయుక్త మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇండియా జోలికి రావాలంటే పాకిస్తాన్ భయపడిపోతుందని వివరించారు. ఇండియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని.. మొన్న చూపించామని... వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ స్పష్టం చేశారు. అటు ఎయిర్‌ మార్షల్‌ ఏకే భారతి మాట్లాడుతూ 110 మంది టెర్రరిస్టులు హతమయ్యారనిపేర్కొన్నారు. పాక్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని ప్రకటించారు. ఉగ్రవాదులను అంతం చేయడమే ఆపరేషన్ సిందూర్ టార్గెట్ అన్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యుల ఆవేదనను దేశం మొత్తం చూసింది.. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్‌ చేశామన్నారు.

Next Story