పాకిస్తాన్ పై పవన్ కళ్యాణ్ సంచలన ట్రీట్.. ఎలుకలు అంటూ

by velandi.Saikiran |   (  Updated:2025-05-13 04:46:21  IST  )

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. సీజ్ ఫైర్ బ్రే

పాకిస్తాన్ పై పవన్ కళ్యాణ్ సంచలన ట్రీట్.. ఎలుకలు అంటూ
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. సీజ్ ఫైర్ బ్రేక్ చేయడంపై కూడా పాకిస్తాన్ దేశాన్ని పచ్చి బూతులతో తిడుతూ రెచ్చిపోతున్నారు జనాలు. అయితే ఈ నేపథ్యంలోనే... పాకిస్తాన్ వక్రబుద్ధిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Deputy Chief Minister Pawan Kalyan) కూడా స్పందించారు.

ఎలుకలన్నీ ( Rates) ఘోషించినా కూడా ఏ హాని జరుగుతుంది ? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇండియన్ ఆర్మీని పొగుడుతూ పోస్ట్ పెట్టారు.

ఎలుకలన్నీజేరి సముద్రము వలే, ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది? శేషనాగు చేసే ఒక్క హుంకారం మాత్రంచేతనే అవన్నీ నశిస్తాయి. అనే పద్యాన్ని.. ఆర్మీ ని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు.. ఇక ఈ పద్యానికి ఎస్ 400 మిస్సైల్ వ్యవస్థకు సంబంధించిన ఫోటోను పంచుకున్నారు పవన్ కళ్యాణ్. తమిళ కవి తిరువల్లూర్ రచించిన తిరుక్కురల్ గ్రంథంలోని పద్యాన్ని పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ గా మారింది.

Next Story