- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. కాంగ్రెస్ అధిష్టానం అత్యవసర సమావేశం
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.

దిశ,వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. అనేక పరిణామాల అనంతరం భారత ఆర్మీ "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. 80 మంది ముష్కరులను అంతమొందించింది. భారత్ ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ తో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అత్యవసర భేటీ(AICC Meeting) అయింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్, POKలోని ఉగ్రవాద స్థావరాలపై ఉక్కుపాదం మోపిన భారత భద్రతా బలగాలను చూసి గర్విస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.






