- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
India Pakistan War: మోడీ కోసం రంగంలోకి దిగిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంటలిజెన్స్ ఏజెన్సీ..

దిశ, వెబ్ డెస్క్: India Pakistan War: భారత్ పాకిస్తాన్ మధ్య ఓవైపు ప్రత్యక్షంగా యుద్ధం జరుగుతూ ఉంటే మరోవైపు పాకిస్తాన్ తన కుటిల నీతితో, దొంగ దెబ్బ తీసేందుకు గూఢచార్య ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇందులో భాగంగా పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్తో పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఐఎస్ఐ చేతులు కలిపింది. ఇజ్రాయిల్ పైన ఎలాగైతే హమాస్ దాడులు చేస్తుందో, అదే తరహాలో భారత్ పైన కూడా దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల హమాస్ కు చెందిన నేతలు తరచూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు వచ్చి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హమాస్ గతంలో ఇజ్రాయిల్ పైన అనేక ఉగ్రదాడులు చేయడంతో పాటు పలు విధ్వంసక కార్యక్రమాల్లో కూడా ఈ ఉగ్రవాద సంస్థకు హస్తముంది. అలాంటి ఉగ్రవాద సంస్థ ఇప్పుడు పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అయినా ఐఎస్ఐ తో చేతులు కలిపి భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాకిస్తాన్ కుతంత్రానికి భారత్ విరుగుడు మాత్రం కనిపెట్టింది.
హమాస్ ను ఎదుర్కొనాలంటే దానికి కరెక్ట్ ఇజ్రాయిల్ రహస్య గూఢచార సంస్థ మొస్సాద్ అసలైన దీటైన జవాబు అని భారత్ నిర్ణయించుకుంది. అందుకే హమాస్ ను ఎదుర్కొనేందుకు ఇప్పుడు ఇజ్రాయిల్ గూడచారి సంస్థ మొస్సాద్ తో చేతులు కలిపి భారత గూడచారి సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ గూడచారి సంస్థ మొస్సాద్ గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సమర్థవంతమైన ఇంటలిజెన్స్ ఏజెన్సీలలో మొస్సాద్ ఒకటి. హిబ్రూ భాషలో మొస్సాద్ అంటే ఇనిస్టిట్యూట్ అని అర్థం. ఇది ఎంత శక్తివంతమైన సంస్థ అంటే ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఈ సంస్థకు గూడచారులు ఉన్నారు. ఎవరైతే ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా పనిచేస్తారో అలాంటి ఉగ్రవాదులను ట్రాక్ చేసి, వారిని హత్యలు సైతం చేసేందుకు వెనకాడరు.
గతంలో పాలస్తీనా, హమాస్, హిజబుల్లా, ఇరాన్ కు చెందిన అనేకమంది ఉగ్రవాదులను, ఉగ్రవాద నేతలను మొస్సాద్ ఏకంగా హత్యలు చేసేందుకు కూడా వెనుకాడలేదు. 1976లో పాలస్తీనా ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఉగాండాలో ల్యాండ్ చేయగా, ఇజ్రాయిల్ కు చెందిన మొస్సాద్ అలాగే ఆ దేశ కమాండోలు ఒక విదేశీ గడ్డ పైన కమాండో ఆపరేషన్ జరిపి ఉగ్రవాదులు అందర్నీ హతమార్చి విమానాన్ని విడిపించింది. మొత్తానికి పాకిస్తాన్ కు సరైన గుణపాఠం నేర్పేందుకు హమాస్ ను సైతం చెక్ పెట్టేందుకు మొస్సాద్ రంగంలోకి దిగింది. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాల్సిందే.