ఆపరేషన్ సిందూర్: ప్రధాని మోడీతో ఆర్మీ ఛీఫ్ అత్య‌వ‌సర భేటీ

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య ఉధ్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. భార‌త్ మంగ‌ళ‌వారం రాత్రి పాకిస్థాన్ మ‌రియు పీవోకేలోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆపరేషన్ సిందూర్: ప్రధాని మోడీతో ఆర్మీ ఛీఫ్ అత్య‌వ‌సర భేటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య ఉధ్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. భార‌త్ మంగ‌ళ‌వారం రాత్రి పాకిస్థాన్ మ‌రియు పీవోకేలోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే.ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య ఉధ్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. భార‌త్ మంగ‌ళ‌వారం రాత్రి పాకిస్థాన్ మ‌రియు పీవోకేలోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో బుధ‌వారం పాకిస్థాన్ భార‌త్ లోని 15 న‌గ‌రాల్లో ఉన్న ఆర్మీ స్థావ‌రాల‌పై దాడుల‌కు ప్ర‌య‌త్నించింది. వాటిని స‌మ‌ర్ద‌వంతంగా తిప్పికొట్ట‌డంతో ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

కానీ బార్డ‌ర్ వ‌ద్ద పాక్ ఆర్మీ స‌రిహ‌ద్దుల్లో ఉన్న గ్రామాల‌పై దాడులు చేస్తూ సామాన్యుల ప్రాణాలు తీస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అలా 16మంది భార‌త పౌరులు ప్రాణాలు విడిచారు. మ‌రోవైపు పాక్ డ్రోన్ దాడుల‌కు సైతం పాల్ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోడీని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అత్య‌వ‌స‌రంగా వెళ్లి క‌లిశారు. మెడీ నివాసానికి వెళ్లిన ఆర్మీ చీఫ్ ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఇండియా పాక్ ఉధ్రిక్త‌త‌ల మ‌ధ్య స‌మావేశంలో ఏం చర్చిస్తార‌నేది ఉత్కంఠ‌గా మారింది.

Next Story