వాళ్లు కూడా పాసయ్యారు : విద్యాశాఖ

by  |
వాళ్లు కూడా పాసయ్యారు : విద్యాశాఖ
X

దిశ, వెబ్ డెస్క్ :
రాష్ట్రంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు కదా..పట్టణాలతో సమానంగా పల్లెల్లోనూ కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. మొన్నరెగ్యూలర్ పది విద్యార్థులను పాస్ చేసినట్లు గానే, ఈరోజు పరీక్షలు లేకుండా ఓపెన్ పదోతరగతి, ఇంటర్ విద్యార్థులను కూడా పాస్ చేశారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విద్యార్థులందరికీ 35మార్కులు ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో పరీక్షలు రాయకుండానే 35వేల మంది పది విద్యార్థులు , 43వేల మంది ఇంటర్ విద్యార్థులు ఉత్తీర్ణులు కాబోతున్నారు.



Next Story

Most Viewed