ఒక్క వెంటిలేటర్.. నలుగురు పేషెంట్స్.. అండగా కొత్త టెక్నాలజీ

by  |
ఒక్క వెంటిలేటర్.. నలుగురు పేషెంట్స్.. అండగా కొత్త టెక్నాలజీ
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో కోవిడ్ 19 విజృంభిస్తున్న సమయంలో కొత్తగా వెంటీలేటర్ల కొరత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సాయనికి సిద్దంగా టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ప్రిస్మా హెల్త్ వెస్పర్ అనే అమెరికా కంపెనీ ఒక వెంటిలేటర్ తయారుచేసింది. దీని ద్వారా ఒకేసారి నలుగురు పేషెంట్లకు వెంటిలేషన్ చేసే సౌకర్యం కలుగుతుంది. రోజురోజుకి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఇలాంటి వెంటిలేటర్ల వల్ల ఎంతో ఉపయోగం ఉందని అక్కడి డాక్టర్లు అంటున్నారు.

ఆ వెంటిలేటర్ త్రీవే కనెక్టర్ ద్వారా పనిచేస్తుంది. ప్రధాన వెంటిలేటర్‌కి మరో మూడు వెంటిలేటర్లు అనుసంధానమై ఉంటాయి. పక్కపక్కనే ఉన్న బెడ్లలో నలుగురికి ఈ వెంటిలేటర్‌ని అమర్చవచ్చు. దీనిని డెవలప్ చేయడం కూడా చాలా సులభం. వీటికి సంబంధించిన సోర్స్ కోడ్‌ను, అలాగే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ప్రిస్మా హెల్త్ వెస్పర్ కంపెనీ ఆసుపత్రులకు అందజేసింది. ఈ పరికరాన్ని డాక్టర్ సారా ఫారిస్ అనే ఎమర్జెన్సీ రూమ్ డాక్టర్ రూపొందించారు.

Tags: Ventilator, CORONA, COVID 19, America, Crisis

Next Story

Most Viewed