నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం..

by  |
నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం..
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి దగ్గర చోటుచేసుకున్న ప్రమాదంలో కృష్ణయ్య అనే వ్యక్తి మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


Next Story