ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

by  |
ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణకు సంబంధించిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 16 నోటిఫికేషన్‌ వెలువడుతుందని ఎన్నికల కమిషన్ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 23న నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీలో తూర్పు గోదావరి టీచర్ గ్యాడుయేట్ ఎమ్మెల్సీలో రాము సూర్య రావు కొనసాగుతుండగా.. మార్చి 29న రిటైర్డ్ కానున్నారు. అలాగే , కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న ఎ.ఎస్ రామకృష్ణ కూడా మార్చి 29తో పదవి కాలం ముగియనుంది. ఇక తెలంగాణలో రంగారెడ్డి-మహబూబ్‌నగర్-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ రామచందర్‌ రావు, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. వీరి పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed