అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్

by  |
అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2015లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై జరిగిన దాడి కేసులో పలుమార్లు విచారణకు పిలిచినా అసదుద్దీన్ కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2015లో హైదరాబాద్ మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, షబ్బీర్‌ అలీ ఒకే కారులో వెళ్తుండగా అడ్డగించిన కొందరు వ్యక్తులు.. కారులో ఉన్న షబ్బీర్‌ అలీపై దాడి చేశారు. ఘటనలో ప్రధాన నిందితుడిగా అసదుద్దీన్ ఓవైసీని పేర్కొన్న పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనే ఈ దాడిలో తన పాత్రలేదని అసద్ ట్వీట్ ద్వారా వివరించారు. ఐదేళ్లుగా ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతున్నా అసద్ హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.



Next Story

Most Viewed