ఓటీటీలో ‘నిశ్శబ్దం’ కన్‌ఫర్మ్

by  |
ఓటీటీలో ‘నిశ్శబ్దం’ కన్‌ఫర్మ్
X

దిశ, వెబ్‌డెస్క్: స్వీటి అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. చాలా కాలం తర్వాత అనుష్క మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఫుల్ క్రేజ్ ఏర్పడగా.. అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి డిమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు కూడా ఓకే చెప్పగా దాదాపు ప్రైమ్‌లో రిలీజ్ అవడం ఫిక్స్ అయిపోయింది.

ఇప్పటికే నేచురల్ స్టార్ నాని ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుండగా.. సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’, కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ చిత్రాల ఓటీటీ రిలీజ్ ఇప్పటికే కన్‌ఫర్మ్ అయింది. ఇప్పుడు నిశ్శబ్దం కూడా ఈ లిస్ట్‌లో చేరగా.. స్వీటీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన చిత్రానికి కోన వెంకట్ నిర్మాత. కాగా గోపీ సుందర్, గిరీష్ జీ సంగీతం అందిస్తుండగా.. ఆర్.మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.



Next Story

Most Viewed