దారుణం.. నిద్రలోనే తుదిశ్వాస విడిచిన 9 మంది.. ఎక్కడంటే?

by  |
దారుణం.. నిద్రలోనే తుదిశ్వాస విడిచిన 9 మంది.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : నిద్రలోనే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. అందులో నలుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. తమిళనాడు రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని పేర్నాంబట్టు గ్రామంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇల్లు ఒక్కసారిగా కుప్ప కూలింది.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా అందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు వైద్యం నిమిత్తం ఇవ్వనున్నట్టు తెలిపారు. అనంతరం మృతులకు కుటుంబాలకు సంతాపం తెలిపారు.



Next Story

Most Viewed