పరాయి స్త్రీ మోజులో భర్త.. అది తెలిసి భార్య ఏం చేసిందంటే..?

by  |
పరాయి స్త్రీ మోజులో భర్త.. అది తెలిసి భార్య ఏం చేసిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఆడపిల్లకు పెళ్లంటే ఎన్నో భయాలు ఉంటాయి. తల్లిదండ్రులను, బంధువులను, సొంత ఇల్లును వదిలి ఎవరో తెలియని వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండడానికి వెళ్తుంది. అలా వచ్చిన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ మోజులో పడి, భార్యను మరిస్తే.. సొంత తల్లిదండ్రులుగా చూడాల్సిన అత్తమామలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తుంటే… ఆ బాధలు తట్టుకోవడం కన్నా చావే పరిష్కారమనుకున్న ఓ యువతి.. తన తనువు చాలించింది. కూతురికి పెళ్లి చేసి పంపించామని సంతోషంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ఈ విషాద ఘటన తమిళనాడు లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన కథనాల ప్రకారం ..

తంజావూరు సమీపంలో ఉన్న తిరుకాట్టుపల్లి వేలంగుడికి చెందిన కల్యాణసుందరం చిన్న కుమార్తె భువనేశ్వరి (25)ను ఆర్కాడ్‌కు చెందిన కలియమూర్తి కుమారుడు రంగరాజ్‌ (30)తో ఏడాది క్రితం వివాహం అయింది. ఎన్నో ఆశలతో భువనేశ్వరి అత్తవారింట అడుగుపెట్టింది. కానీ ఆమె ఆశలు అడియాశలేనని ఆమెకు కొద్దీ రోజులోనే అర్ధమయ్యింది. పెళ్లై సంవత్సరం అవుతున్నా భర్త తనతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. చుట్టుపక్కల వాళ్లు భర్తకు, వేరే యువతితో సంబంధం ఉందని చెప్తుండడంతో షాకయ్యింది. దీంతోపాటు అత్తమామలు అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేసేవారు. ఈ బాధలను ఆ యువతి తట్టుకోలేకపోయింది. ఈ నరకయాతన కన్నా చావే పరిష్కారమనుకొని మంగళవారం ఇంట్లో భువనేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతి పట్ల అనుమానం ఉన్నట్లు కల్యాణసుందరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed