జూలై 1 నుంచి కొత్త రూల్స్.. మారుతున్న అంశాలు ఇవే..

by  |
జూలై 1 నుంచి కొత్త రూల్స్.. మారుతున్న అంశాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్ : జూలై 1 నుంచి బ్యాంకులు కొత్త రూల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. మరో వైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా మారవచ్చని ఆ వర్గాలు చెప్పాయి. వచ్చే నెల నుంచి ఏ ఏ అంశాలు మారబోతున్నాయో తెలుసుకుందాం.

1. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన మారుతూ ఉంటాయి. వచ్చే నెల కూడా ఇదే జరగొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో సిలిండర్ రేటు స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

2. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకువస్తోంది. చెక్ బుక్, ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్ మారనున్నాయి. చార్జీలు పెంచింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

3. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని వారు ఈ నెలలోపు.. ట్యాక్స్ పని పూర్తి చేయాలి. లేదంటే జూలై 1 నుంచి డబుల్ టీడీఎస్ చెల్లించుకోవాల్సి వస్తుంది.

4. సిండికేట్ బ్యాంక్ IFSC Codes వచ్చే నెల నుంచి చెల్లవు. కొత్తగా కెనరా బ్యాంక్ IFSC Code ఉపయోగించాలి. లేదంటే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం వీలు కాదు.

5. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెంపు జూలై 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో కొత్తగా వెహికల్ కొనే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది.



Next Story