- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ రియా చక్రవర్తికి సపోర్ట్గా నిలిచింది. సుశాంత్ కేసులో అప్పుడే తనను దోషిగా తేల్చకూడదని కోరిన విద్య.. దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ ఆ విషయాన్ని నిరూపిస్తాయని.. ఆలోపు రియా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని కోరింది. ఆ కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో తాను ఊహించగలను అంటూ లక్ష్మీ మంచు పెట్టిన పోస్ట్కు మద్దతు తెలుపుతూ విద్య చేసిన ట్వీట్కు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
కాగా, ‘విద్యా బాలన్ గారు.. సుశాంత్ ఫ్యామిలీ అంత బాధలో ఉన్నప్పుడు మాట్లాడలేదు కానీ, ఇప్పుడెందుకు రియాకు మద్దతుగా నిలుస్తున్నారని’ ప్రశ్నిస్తున్నారు సుశాంత్ ఫ్యాన్స్. డ్రగ్ డీలర్స్ వ్యవహారం బయటకొచ్చాక కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలని మండిపడుతున్నారు. క్రిమినల్స్కు సపోర్ట్ చేయడం ఇంకా అతి పెద్ద క్రైమ్ అన్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. 80 రోజులుగా పిచ్చి వాళ్ళలాగా మేము చేసిన పోరాటం ఫూలిష్గా అనిపిస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్తో నీ మీద ఉన్న గౌరవం కోల్పోయామని, సుశాంత్ మరణంతో ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ లాస్ జరిగినా సరే.. ఇప్పటికైనా నిజాలు ఎందుకు మాట్లాడలేక పోతున్నారని అన్నారు. కనీసం వాస్తవికతను చూసే ధైర్యం చేయండి.. అంతేకాని ఇలాంటి పోస్ట్లతో మరింత బాధ కలిగించకండని కోరారు.